హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు వెబ్సైట్లో ప్రదర్శించాలన్న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. చాలా వరకు పాఠశాలలు వెబ్సైట్లో ఫీజులను ప్రదర్శించలేదు. విద్యాశాఖ విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది.
ఒక్క సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు మాత్రమే వెబ్సైట్లో ప్రదర్శించాయి. స్టేట్బోర్డు గుర్తింపు పొందిన బడులు బేఖాతరు చేశాయి. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లోని ఓ పాఠశాల యాజమాన్యం అసలు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పడం విశేషం.