నర్వ, మార్చి 18 : మండలంలోని 19 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎ స్సీ కాలనీ రూ.15లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరమై న మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్ర జాప్రతినిధులు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ను పార్టీలు, వర్గాలకతీతకంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశె ట్టి, వైస్ఎంపీపీ వీణవతి, సింగిల్విండో వైస్చైర్మన్ లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని జక్కన్నపల్లి గ్రామాని కి చెందిన నర్సింహరెడ్డి కొన్ని నెలల కింద ట గుండె సంబంధిత వ్యాధితో బాధపడు తూ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.30వేల చెక్కును ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య సం రక్షణకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇప్ప టి వరకు మండలానికి సీఎంఆర్ఎఫ్ నుంచి అధికసంఖ్య లో వచ్చిన చెక్కులు లబ్ధిదారులకు అందజేశామన్నారు. కా ర్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, సర్పంచ్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.