ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. అయోధ్యను ఆధ్యాత్మిక కేంద్రంగా,అంతర్జాతీయ పర్యాటక కూడలిగా,సుస్థిర అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రణాళికనురూపొందించారు.ఈ సందర్భంగా అయోధ్యతో అనుసంధానపెంచేదిశగా రూపుదిద్దుకోనున్న,ప్రతిపాదిత పథకాల గురించి వారు ప్రధానికి వివరించారు.
ఇందులో భాగంగా విమానాశ్రయం,రైల్వే స్టేషన్ విస్తరణ,బస్సుస్టేషన్,రోడ్లు,రహదారులు తదితర అంశాల గురించి చర్చించారు. దీంతోపాటు అయోధ్యకు అనుబంధంగా హరితక్షేత్ర శివారు పట్టణాభివృద్ధిపైనా అధికారులు చర్చించారు. నగరాన్ని సందర్శించే భక్తులకు వసతిసహా ఆశ్రమాలు, మఠాలు, హోటళ్లు, వివిధ రాష్ట్రాల భవనాలకు స్థలం కేటాయించబడుతుంది. ఇవేకాకుండా పర్యాటకుల కోసంవసతి కేంద్రం,ప్రపంచ స్థాయి ప్రదర్శనశాల నిర్మాణం కూడా చేపడతారు.