న్యూఢిల్లీ : జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా భారత పర్యటన రద్దయింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్లో ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రిటన్, జపాన్ దేశాల ప్రధానమంత్రులు తమ భారతదేశ పర్యటనను రద్దు చేసుకున్నారు.
యోషిహిదే సుగా వచ్చే వారం భారత్, ఫిలిప్పీన్స్ దేశాలను సందర్శించాల్సి ఉన్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాల పర్యటనను ప్రధాని సుగా రద్దు చేసినట్లు జపాన్ మీడియా తెలిపింది. సుగా ప్రధాని పదవి చేపట్టాక చేస్తున్న తొలి భారత పర్యటన ఇది.
మరోవైపు, ఏప్రిల్ 24 నుంచి 30 మధ్య బ్రిటన్కు వెళ్లే ఎయిరిండియా అన్ని విమానాలు కూడా రద్దయ్యాయి. ఈ సమయంలో ఢిల్లీ, ముంబై మధ్య యూకేకు కనీసం ఒక విమానమైనా షెడ్యూల్ చేసే ప్రయత్నం జరుగుతున్నదని ఎయిరిండియా తెలిపింది.
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..