రవీంద్రభారతి : ప్రాచీన శాస్త్రీయ సంగీత, కూచిపూడి, జానపద నృత్యాలను కావాడుకోవాలని ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు పేర్కొన్నారు .తెలంగాణ భాషా సాంస్కృతిశాఖ సౌజన్యంతో కీర్తి ఆర్ట్స్ అకాడమీ 4వ వార్షికోత్సవ కార్యక్రమం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు విచ్చేసి మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రాదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. శాస్త్రీయ నృత్యం కూచిపూడి, భరత నాట్యం, గ్రామీణ ప్రాంత నృత్యాలైన జానపధ నృత్యాలను మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.
శాస్త్రీయ నృత్యాలతో మన తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, కిరణ్కుమార్, కొండవీటి జయప్రద, పిఎస్ఎస్ఎస్ గాంధీ, డాక్టర్ ఎంఆర్దరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల,బాలికలు చేసిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి.