హైదరాబాద్, మార్చి 12: ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన హావెల్స్..మార్కెట్లోకి విద్యుత్ ఆదా ఫ్యాన్లను విడుదల చేసింది. ఒకేసారి 19 మోడళ్ళను విడుదల చేసిన సంస్థ..ఇవి రూ.7 వేల ప్రారంభ ధరతో రూ.35 వేల గరిష్ఠ ధరలో లభించనున్నాయి. విద్యుత్ను ఆదా చేసే ఈ ఫ్యాన్లతో ప్రతియేటా రూ.2 వేల వరకు విద్యుత్ బిల్లు ఆదా కానున్నదని కంపెనీ ప్రెసిడెంట్ రవింద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుత వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఈ ఫ్యాన్లు సీలింగ్, పెడెస్టాల్, వాల్, వెంటిలేటర్ వంటి విభాగానికి చెందినవి చెప్పారు. వోల్టేజ్ స్టేబిలేజర్, ఆర్ఎఫ్ టెక్నాలజీ రిమోట్ కలిగిన ఈ ఫ్యాన్లను హరిద్వార్ ప్లాంట్లో తయారుచేసినట్లు చెప్పారు. గది ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా ఫ్యాన్ వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది.