న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: డయాబెటిస్, బరువు తగ్గించటంలో అత్యంత జనాదరణ పొందిన మందులు వాడుతున్న రోగులు ఊహించిన దాని కంటే ఎక్కువగా కండరాల బలాన్ని కోల్పోతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అధ్యయనం ప్రకారం, సిమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ అనేవి..ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ రోగులు విస్తృతంగా వాడుతున్న మందులు.
ఈ మందుల్ని నిరంతరం వాడుతున్న రోగులు బరువు తగ్గటంతోపాటు కండరాల బలాన్ని కూడా కోల్పోతున్నారని, ఇది ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు చికిత్స పొందుతున్న రోగుల్లో కండరాల ఆరోగ్యంపై వైద్యులు మరింత పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.