ఆంటిగ్వా: వెస్టిండీస్ వన్డే, టీ 20 జట్లకు కెప్టెన్గా నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు కీరన్ పొలార్డ్ వీడ్కోలు పలుకడంతో అతడి బాధ్యతలను పూరన్కు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) అప్పగించింది. రెండు మెగాటోర్నీలకు కరీబియన్ సేన పూరన్ సారథ్యంలోనే బరిలోకి దిగనుంది. ఈ ఏడాది అక్టోబర్లో టీ20 ప్రపంచకప్తో పాటు 2023లో భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్నకు కరీబియన్ సేన పోటీపడనుంది. ఈనెలాఖరున నెదర్లాండ్స్తో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు పూరన్ పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడు ప్రస్తుతం ఐపీఎల్-15వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు.