న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ ఉదయం ఘోరం జరిగింది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన పోలీస్ అధికారి ఢిల్లీ పోలీస్ విభాగానికే చెందిన ఏఎస్ఐ తేజ్పాల్ (55)గా అధికారులు గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని జఖీరా ఫ్లైవోవర్ దగ్గర విధి నిర్వహణలో ఉన్న ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్కు చెందిన వ్యాన్లో కూర్చుని, తన సర్వీస్ రివాల్వర్తో ఛాతిలో కాల్చుకున్నాడు. వెంటనే సహచర పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కాగా, మృతుడు తేజ్పాల్ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన వాడుగా పోలీస్ అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వారు చెప్పారు. తేజ్పాల్ ఆత్మహత్యకు పాల్పడిన వ్యాన్ను దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు సేకరించారు.