హైదరాబాద్ : వనస్థలిపురం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.18.28 లక్షలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
వెంకట్రెడ్డి దగ్గర లోన్ తీసుకుని తిరిగి చెల్లించాక.. దోచుకోవాలని నయీం ప్రణాళిక వేశారని పేర్కొన్నారు. నిందితులు వెంకట్రెడ్డి దగ్గర తీసుకున్న అప్పు తీసుకొని తిరిగి ఇచ్చేశారని, డబ్బుతో వెంకట్రెడ్డి ఇంటికి వెళ్తుండగా ఉమర్, మరో వ్యక్తి.. వెంకట్రెడ్డిని ఢీకొట్టి రూ.50 లక్షలతో పారిపోయేందుకు యత్నించారన్నారు. రూ.50 లక్షలు తీసుకుని వెళ్తుండగా రూ.25 లక్షలు అక్కడే పడిపోయాయని, రూ.25 లక్షలతో నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయారని, దోపిడీలో ఐదుగురి నిందితులను గుర్తించామన్నారు.
సీసీటీవీ కెమెరాల ఆధారంగా దోపిడీ కేసును ఛేదించామని వివరించారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీకి ప్లాన్ చేశారని, బార్ యజమాని వెంటక్రెడ్డి వద్ద నిందితులు అప్పు తీసుకున్నారని, అప్పుతీర్చడానికి వచ్చి డబ్బు కొట్టేయాలని ప్రణాళిక రచించారన్నారు. రూ.50లక్షలు దోపిడీ చేసి పారిపోయాలని భావించారని, తీసుకువచ్చిన రెండు బ్యాగుల్లో ఒక బ్యాగుతో పారిపోయారని వివరించారు.