మొక్కలు, మూడు బైకులు స్వాధీనం
జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 24: గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సాగు చేసిన గంజాయిని జగిత్యాలకు తీసుకొచ్చి అమ్ముతున్న ఇద్దరిని ఆదివారం జగిత్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి గంజాయి మొక్కలు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన మేకల రాజు, అరుముల్ల సాయికుమార్ స్నేహితులు. వీరు గతంలో గంజాయికి బానిసలయ్యారు. వీరు ఆసిఫాబాద్, ఆదిలాబాద్లో సాగు చేసిన గంజాయి మొక్కలను జగిత్యాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. సెప్టెంబర్ 28న పోలీసులు రాజును అరెస్ట్ చేయగా సాయికుమార్ తప్పించుకున్నాడు. తాజాగా సాయికుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిగూడకు చెందిన మాడావి చందు గంజాయి సాగు చేస్తాడని, అతడి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి రాజుతో కలిసి జగిత్యాలలో ఎక్కువ ధరకు అమ్ముతున్నానని అంగీకరించాడు. ఈ క్రమం లో సీఐ కిశోర్, లింగాపూర్ డిప్యూటీ తాసిల్దార్తో కలిసి చందు సాగుచేస్తున్న గంజాయి తోటకు వెళ్లారు. పత్తి చేనులో సాగు చేసిన గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే వీరి వద్ద నుంచి మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా చేసిన తర్వాత చందు, సాయికుమార్లను ఆదివారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.