మద్యం మత్తులో వాహనాన్ని నడిపి పోలీసులకు పట్టుబడిన వ్యక్తి అదే స్థితిలో ఆ వాహనాన్ని నడుపరాదు. అతనితో మద్యం సేవించని వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్తో ఉంటే అతనికి వాహనాన్ని ఇవ్వాలి. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదుచేస్తే సీజ్ చేసిన వాహనంపై సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో మూడు రోజుల్లోగాచార్జిషీటు దాఖలు చేయాలి.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో వాహనాలను నడిపితే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొనే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. వాహన ఒరిజినల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, గుర్తింపు కార్డు చూపితే వాహనాన్ని యజమానికి తిరిగి స్వాధీనపర్చాలని ఆదేశించింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 43 రిట్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర మోటారు వాహన చట్టంలోని 448ఏ నిబంధన ప్రకారం పోలీసులు నడుచుకోవాలని సూచించింది. ‘మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు పట్టుబడిన వ్యక్తి అదే స్థితిలో ఆ వాహనాన్ని నడుపరాదు. అతనితో మద్యం సేవించని వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్తో ఉంటే అతనికి వాహనాన్ని ఇవ్వాలి. ఒకవేళ మద్యం సేవించని వ్యక్తి లేకపోయినా, మరో వ్యక్తి వెంట లేకపోయినా మద్యం సేవించిన వ్యక్తి ఇచ్చే సమాచారం మేరకు సమీపంలోని అతని స్నేహితులు, బంధువులను పిలిచి వారికి వాహనాన్ని అప్పగించాలి. ఎవరూ రానప్పుడు మాత్రమే పోలీసులు వాహనాన్ని తాతాలికంగా స్వాధీనం చేసుకోవాలి. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదుచేస్తే సీజ్చేసిన వాహనంపై సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో మూడు రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్లో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టు ధికరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.’ అని ధర్మాసనం తీర్పులో స్పష్టంచేసింది.