న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో త్వరలో పోకో ఎఫ్5 5జీని (Poco F5 5G) లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అధికారికంగా లాంఛ్ డేట్ను ఇంకా వెల్లడించకపోయినా భారత్లో పోకో లేటెస్ట్ ఫోన్ను త్వరలో లాంఛ్ చేస్తామని కంపెనీ హెడ్ హిమాన్షు టాండన్ ట్వీట్ చేశారు. అప్కమింగ్ పోకో ఫోన్ క్వాల్కాం న్యూ స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ను కలిగిఉంటుందని టాండన్ తెలిపారు.
ఈ ప్రాసెసర్ను మార్కెట్లో తొలిసారిగా పోకో ఎఫ్5 వాడటం విశేషం. మిడ్ రేంజ్ డివైజ్ల కోసం స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ను ఈ ఏడాది మార్చిలో అనౌన్స్ చేశారు. పోకో ఎఫ్5తో యూజర్లు పవర్ఫుల్ పెర్ఫామెన్స్ను పొందుతారని హిమాన్షు టాండన్ చెప్పుకొచ్చారు. ఇక పోకో ఎఫ్4 రూ. 27,999కి అందుబాటులో ఉండటంతో న్యూ పోకో ఎఫ్5 5జీ దాదాపు ఇదే ధరకు లభించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లాంఛ్ ఈవెంట్కు ముందు ఈ హాట్ డివైజ్ ఫీచర్లపై కంపెనీ మరిన్ని వివరాలు వెల్లడించనుంది. అయితే ఈ డివైజ్పై వెల్లడైన లీక్ల ఆధారంగా స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే..పోకో ఎఫ్5 5జీ 6.67 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్, ట్రిపుల్ కెమెరా సెటప్తో రానున్న పోకో లేటెస్ట్ ఫోన్ లేటెస్ట్ అండ్రాయిడ్ 13 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది. పోకో 5జీ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ను కలిగిఉంటుంది.
Read More