బాన్సువాడ రూరల్, నవంబర్ 10 : గత నలభైసంవత్సరాలుగా తనకు అండగా ఉంటున్న నియోజకవర్గ ప్రజలే నా బలగం.. బలం అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, ఇబ్రహీంపేట్ తండా, రాంపూర్ తండా, రాంపూర్, పులికుచ్చతండా, కొల్లూరు, నాగారం గ్రామాల్లో ఎన్ని కల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మహిళలు తిలకం దిద్ది, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజ ల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీలు కాలం చెల్లిన పార్టీలని, ఈ రెండు పార్టీలు తమ ఉనికి కోసం కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసేందుకు తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నాయని అన్నారు. తాను స్థానికుడినని, ఇతర ప్రాంతాల నుంచి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందు వలస నాయకులు వస్తున్నారని విమర్శించారు. సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించాలని కోరారు. కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పోచారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బోర్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నికల ప్రచారంలో సర్పంచులు సరళ, నారాయణరెడ్డి, ప్రేమ్సింగ్, లలిత, ఈశ్వరీరేఖ, పీర్సింగ్, తుకారాం, రాచప్ప, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, ఎంపీపీ, జడ్పీటీసీలు దొడ్ల నీరజారెడ్డి, పద్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, వైస్ ఎంపీపీ హరిసింగ్, ఎంపీటీసీ శ్రావణి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దేవేందర్రెడ్డి, నారాయణరెడ్డి, సాయిరెడ్డి, ప్రవీణ్రెడ్డి, సాయిలు యాదవ్, సాయి లు, జలీల్, హైమద్, అజీం, మోహన్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాన్సువాడ/నస్రుల్లాబాద్/కోటగిరి, నవంబర్ 10 : బాన్సువాడలోని 5, 14, 10, వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా స్పీకర్ పోచారం సోదరుడు పరిగె శంభురెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు చిదుర శ్రీనివాస్ గుప్తా, సిద్ధంశెట్టి రమేశ్గుప్తా, చిదుర వినయ్ గుప్తా, కిరాణ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ రాజు, సిర్న దత్తు, నాగుల గామ సాయిబాబా, రుద్రంగి గంగాధర్, చంద్రశేఖర్ గుప్తా, మిజాంపూరి బాలాజీ గుప్తా, కాసం శ్రీనివాస్, సాయినాథ్, రఘు గుప్తా, సిద్ధం శెట్టి శివరాజులు గుప్తా ఉన్నారు. బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, భైరాపూర్, బరంగేడ్గి, సాంబాపూర్ గ్రామాల్లో నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. జడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ సందీప్ పటేల్, ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, అశోక్ ఉన్నారు. నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్లో నాయకులు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ విఠల్, విండో చైర్మన్ మారుతి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, నాయకులు పాల్గొన్నారు. కోటగిరి మండలం దోమలెడ్గిలో సర్పంచ్ జయరాణీ దిగంబర్, ఎంపీటీసీ అనంత విఠల్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు.