ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆదివారం పర్యటించారు. ధ్యాన్చంద్ స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన చేశారు. అక్కడి కాంప్లెక్స్లో ఉన్న జిమ్ను ఆయన సందర్శించారు. జిమ్ స్టాల్లో కాసేపు ఎక్సర్సైజ్ చేశారు. బాడీవెయిట్ లాట్పుల్ మెషీన్పై మోడీ వ్యాయామం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.