సుల్తాన్బజార్: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుండడం అభినందనీయమని కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజ్ఞులత అన్నారు. కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆర్వోబీ అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు, ఎగ్జిబిషన్ ఆఫీసర్ శ్రీనివాస్ పటేల్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహనీయులు త్యాగాలు,విరోచిత పోరాటాల గురించి నేటి తరానికి తెలిపేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు. చిత్ర ప్రదర్శన రేపటి వరకు కొనసాగుతుంది.