పనాజీ: కరోనా కష్టకాలంలోనూ నాలుగు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తుది దశకు చేరుకుంది. తాజా సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ మధ్య ఆదివారం ఫైనల్ ఫైట్ జరుగనుంది. లీగ్ దశలోని మ్యాచ్లన్నీ ఖాళీ మైదానాల్లోనే జరుగగా.. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 ప్రభావం తక్కువగా ఉండటంతో.. తుదిపోరుకు వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్కు అభిమానులను అనుమతిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.