గోదావరిఖని, మార్చి 30: ఎప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చినా మళ్లీ టీబీజీకేఎస్దే గెలుపు అని యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీలో మంగళవారం జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు అనేక హక్కులను అమలు చేయించారని పేర్కొన్నారు. జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను పట్టుబట్టి కారుణ్య పద్ధతిలో తిరిగి తీసుకువచ్చి కార్మికుల కుటుంబాల్లో వారసత్వ హక్కును నింపారన్నారు. సింగరేణి కార్మికులు కూడా టీబీజీకేఎస్కు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పిట్ సెక్రటరీ రాంచందర్, ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్, జాహిద్ పాషా, నాయిని మల్లేశం, కనకం శ్యాంసన్, దేవ వెంకటేశం, ఎట్టం కృష్ణ, వడ్డేపల్లి శంకర్, యాదవరెడ్డి, పుట్ట రమేశ్, గంగాధర్, శేషగిరి, శంకర్, రాజిరెడ్డి, సత్యనారాయణ తదితరులున్నారు.