న్యూఢిల్లీ: వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం రిలీఫ్నిచ్చింది. న్యూ వేజ్కోడ్పై తాము నిర్ణయం తీసుకునే వరకు ఉద్యోగులు ఇంటికి తీసుకెళ్లే వేతనంలో నో చేంజ్ (మార్పు) ఉండదని కేంద్రం తెలిపింది. నూతన వేజ్ కోడ్ ప్రకారం ఉద్యోగులు ఇంటికి తీసుకెళ్లే వేతనం మొత్తంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నూతన వేతన కోడ్కు అనుగుణంగా మార్పులు చేయకపోవడంతో దాని అమలును కేంద్రం వాయిదా వేసింది.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీకి ఎన్నికలు జరుగడంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంత విధానాలకు అనుగుణంగా న్యూ వేజ్ కోడ్లు రూపొందించలేదు. దీనివల్లే విధాన నిర్ణయంలో జాప్యమైందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు చెప్పారు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేసినా.. కేంద్రం జూన్లో సొంత నిబంధనలతో న్యూ వేజ్ కోడ్పై నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. కార్మికుల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంటుంది.
కేంద్ర నిబంధనలు, నోటిఫికేషన్లతో క్లాష్ వస్తే ఏం చేయాలన్న విషయమై స్పష్టత లేదు. ముసాయిదా నిబధనల ప్రకారం ఒక ఉద్యోగి మొత్తం వేతనంలో సగం లేదా అంత కంటే ఎక్కువ బేసిక్ శాలరీగా ఉండాలా? వద్దా? అన్న చర్చ జరుగుతున్నది. అదే జరిగితే ఉద్యోగి ఇంటికి తీసుకెళ్లే వేతనం తగ్గుతుంది. అలాగే ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)కి ఉద్యోగి వాటా కంట్రీబ్యూషన్ పెరుగుతుంది.
ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తే కంపెనీలు తమ ఉద్యోగుల వేతన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం ఉద్యోగి ఇంటికి తీసుకెళ్లే వేతనం సగానికంటే ఎక్కువగా ఉంటుంది. ఇక వారానికి నాలుగు రోజులు మాత్రమే పని దినాల విధానంపైనా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
ఇన్వెస్టర్లూ.. బీ వేర్: ఏప్రిల్లో 11 రోజులు సెలవులే!