తిరుమల : అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. కొవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మూల విరాట్కు, ఉత్సవమూర్తులకు, పద్మావతి అమ్మవారికి, ఆండాళ్ అమ్మవారికి, జయవిజయులకు, గరుడాళ్వార్కు, ఆంజనేయస్వామివారికి, ధ్వజస్తంభం, ఇతర పరివార దేవతలకు పవిత్ర సమర్పణ నిర్వహించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, కంకణ బట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.