చండూరు/మునుగోడు, అక్టోబర్ 4 : మునుగోడు నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. చండూరు పట్టణంలోని పదోవార్డుకు చెందిన బ్రహ్మంగారి దేవాలయ పాలకవర్గ కమిటీతోపాటు 30 మంది మంగళవారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ నాయకుల మాయ మాటలు విని మోసపోయామని, నిజం తెలుసుకొని తిరిగి టీఆర్ఎస్లో చేరినట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. రోజురోజుకు ప్రజల్లో బీజేపీపై విశ్వసనీయత తగ్గుతున్నదని చెప్పడానికి ఈ చేరికలే నిదర్శనమన్నారు. అలాగే మునుగోడు మండలం సింగారం, కొంపెల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల ముఖ్య కార్యకర్త లు 60 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లి మండలం పెద్దపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సూదనబోయిన యాదయ్య స్థానిక జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.