అమరావతి : పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.. చంద్రబాబు నిర్ణయంతో తీవ్రంగా విబేధించారు.
నిర్ణయం తీసుకునే ముందు పార్టీ కేడర్తో చర్చించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్ణయాలతో నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవన్నారు.
ఏకగ్రీవాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఆగిన చోటు నుంచే ఎన్నికలను ప్రారంభించడం ఏమిటని ఎస్ఈసీని ప్రశ్నించారు. ఏడాదికిపైగా ఎన్నికలు కొనసాగుతుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పోటీ చేసి తీరతాం : అదితి గజపతిరాజు
పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి తీరతామని టీడీపీ నాయకురాలు, అశోక్ గజపతిరాజు కుమార్తె అధితి గజపతి రాజు స్పష్టంచేశారు. కార్యకర్తల కోరిక మేరకు విజయనగరం నియోజకవర్గంలో పోటీ చేస్తామని ఆమె అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి