అమరావతి : తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఈ నెల 24 నుంచి 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ శుక్రవారం వెల్లడించింది.
వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా 25న ఉదయం 8 గంటలకు స్వామివారిని స్వర్ణరథంపై ఊరేగించనున్నట్లు తెలిపింది.
కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. వసంతోత్సవాల సందర్భంగా తిరుమలలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి