అమరావతి : ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోడలను కాపాడబోయి అత్తామామలు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సైదాపురం మండలం చాగణం రాజుపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇండ్ల రవి(57), సునీత (50) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
కాగా, పెద్ద కుమారుడి భార్య చెంచమ్మ ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో కిందపడి పోయింది. గమనించిన అత్తామామలు చెంచమ్మను కాపాడే ప్రయత్నంలో ఇనుప తీగను తొగను తొలగించే క్రమంలో కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. కోడలుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాఆరం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.