హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి భరోసానిచ్చారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు సైతం స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా మూడోదశ ముప్పు నేపథ్యంలో సోమవారం బషీర్బాగ్లోని కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో నమోదవుతున్న కరోనా కేసులపై ఆరా తీశారు. విద్యాసంస్థలు కొవిడ్ తీవ్రత తగ్గిందన్న నిర్లక్ష్యంతో ఉండవద్దని, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను ఉపయోగించాలని చెప్పారు.
గురుకులాలు, వసతిగృహాల్లోని విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని విద్యాసంస్థల్లో కొవి డ్ కేసులు బయటపడుతున్నాయని, అక్కడి విద్యార్థులందరికీ కొవిడ్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తు తం పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.