ఐదో రోజూ ప్రగతి కార్యక్రమాలు
ఎనిమిదేండ్లలో అనేక సంక్షేమ పథకాలు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, జూన్ 7 : పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని ఆస్ర కాలనీని మంగళవారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి సందర్శించారు. ప్రజాప్రతినిధులతో కలిసి ఆస్రకాలనీ, విజయనగర్ కాలనీల్లో కాలినడకన తిరిగారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. గతంలో చేపట్టిన, కొత్త పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎనిమిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలు లబ్ధిపొందేలా పథకాలు అమలు చేస్తున్నదన్నారు. వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించామని పేర్కొన్నారు. త్వరలో వారికి కూడా పింఛన్లు అందజేస్తామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా బాధ్యతగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి కృతజ్ఞతలు..
నిర్మల్లో బీసీ స్టడీ సర్కిల్ మంజూరుకు కృషిచేసిన మంత్రి అల్లోలకు బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్గౌడ్, కృష్ణంరాజు, విద్యార్థి సం ఘం నాయకులు అడిగెల రాజేశ్వర్, సృజిత్, వి ద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసారు. అ ల్లోల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్కు బీసీ స్టడీ సర్కిల్ను మంజూరుచేసి, పేద విద్యార్థు ల బంగారు భవిష్యత్కు బాటలు వేసిందన్నారు. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు హైదరాబాద్ లాం టి పట్టణాలకు వెళ్లి, వేల రూపాయలు ఖర్చు చే యాల్సిన పనిలేదని తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ లో బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, టీఆర్ఎస్ నాయకులు పీ రాంచందర్, దేవేందర్రెడ్డి, ముడుసు సత్యనారాయణ, దాయత్ సోమేశ్, రామలింగం ఉన్నారు.
దాతలకు రశీదుల అందజేత..
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ బంగారు తాపడం నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రశీదులు అందజేశారు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి రూ.10 లక్షలు, అల్లోల సురేందర్రెడ్డి రూ.1.11లక్షలు, అమెడ కిషన్ రూ.51 వే లు, పాకాల రాంచందర్ రూ. 25వేలు, పలువురు విరాళం అందజేశారు. కాగా, తన క్యాంపు కార్యాలయంలో రసీదులు అందించి, అభినందించారు.
భద్ర పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన..
సోన్, జూన్ 7 : న్యూ వెల్మల్ గ్రామంలోని ఆ లయంలో భద్ర పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ని ర్వహించారు. మంత్రి అల్లోల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి సంబంధించిన శి లాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. న్యూవెల్మల్లోనే రూ. 1.10 కోట్లతో వివిధ ఆలయాలను నిర్మించినట్లు చెప్పారు. గ్రామాల్లో భక్తిభావం పెరిగి, సమాజం సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు బా గుండాలని ఆకాంక్షించారు. అంతకుముందు మ హిళలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ అంకం గంగామణి శ్రీనివాస్, ఎంపీటీసీ నాగయ్య, తహసీల్దార్ హిమబిందు, సీఐ నర్సింహారెడ్డి, వీడీసీ నాయకులు సాయన్న, నర్సయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.