హుజూరాబాద్: బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలని బీజేపీ నాయకులు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, గత పదిహేను రోజులుగా వారి వ్యవహారం చూస్తే అలాగే కనబడుతుందని అన్నారు. దీనికి సంబంధించి తాము ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనలే బీజేపీ పన్నుతున్న కుట్రలకు నిదర్శనమన్నారు.
కమలాపూర్లో యాక్సిడెంట్ జరిగితే అది బాల్క సుమన్ కారుతో ఆక్సిడెంట్ చేయించాడని చెప్పి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రెస్మీట్ పెట్టి, దర్నాచేసి నానా హంగామా చేయారన్నారు. అయితే ఆకారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడు విశ్వనాథ్ది కావడంతో వారి ప్రయత్నం విఫలం అయిందన్నారు. అప్పుడు కారులో డబ్బులు ఉన్నట్టు, రోజు అదే కారులో డబ్బులు వస్తున్నట్టు యాక్సిడెంట్ కూడా ఆ క్రమంలోనే జరిగిందని చెప్పిన బీజేపీ వారు కారు బీజేపీ నేత మిత్రుడిదని తేలడంతో ముఖంచాటేశారని మరి కారులో డబ్బులను జారవేస్తున్నారని చెప్పిన బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఆఫీస్లోకి చొచ్చుకువచ్చి దాడులు వారు చేసి కేంద్రమంత్రిపై దాడి చేశారంటూ అబద్దపు ప్రచారం చేశారన్నారు. మా కార్యకర్తలపైనే దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టింది బీజేపీ కాదా అన్నారు. కమలాపూర్, ఇల్లందకుంటలో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో నిన్న హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేటలో బీజేపీ గూండాలు హరీష్ రావు వాహనాన్ని అడ్డుకుని దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు పల్లా రాజేశ్వర్రెడ్డి.