క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరిగిన రెండవ టీ20లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 79 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడతను. తొలుత కివీస్ కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత ఓవర్లలో కివీస్ జట్టు 8 వికెట్లకు 147 రన్స్ చేసింది. ఆ జట్టులో డెవాన్ కాన్వే, మార్క్ చాప్మాన్లు 36, 32 స్కోర్లతో రాణించారు. అయితే 148 టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్థాన్కు ఆరంభంలో జలక్ తగిలింది. త్వరత్వరగా రెండు వికెట్లను కోల్పోయింది. కానీ బాబర్ ఆజమ్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్తో పాక్కు విజయాన్ని అందించాడు.