అనురోప్ కటారి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పడమటి కొండల్లో’. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను యువ హీరో సాయిదుర్గతేజ్ సోషల్మీడియా వేదికగా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి నరేశ్ పెంట దర్శకుడు. జయకృష్ణ దురుగడ్డ నిర్మాత.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచే సినిమా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో గొప్ప ప్రేమకథ కూడా ఉంటుంది. ఆడియన్స్కి ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్. ఈ సినిమాకు చెందిన మరిన్ని విషయాలు త్వరలో ప్రకటిస్తాం’ అని తెలిపారు. యశస్వి శ్రీనివాస్, శ్రావ్యరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కన్నన్ మునిసామి, మాటలు: ఆర్.రాము, దర్శకత్వం, సంగీతం: నరేశ్ పెంట.