న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 12,76,191 డోసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 7.06 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఏడాదిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 81,466 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. రాత్రి 8 గంటల వరకు దేశంలో 7,06,18,026 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 6,13,56,345 కోట్ల మందికి మొదటి డోసు, 92,61,681 మందికి రెండో డోసు తెలిపింది.
89,03,809 మంది ఆరోగ్య కార్యకర్తలు, 95,15,410 మంది ఫ్రంట్లైన్ కార్మికులకు మొదటి డోస్, 52,86132 ఆరోగ్య కార్యకర్తలు, 39,75,549 మంది ఫ్రంట్లైన్ కార్మికులకు రెండో డోస్ ఇచ్చారు. 45 ఏళ్లు పైబడిన 4,29,37,126 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. టీకా డ్రైవ్ శుక్రవారం 77వ రోజు శుక్రవారం ఒకే రోజు 12,76,191 మందికి డోసులు వేసినట్లు చెప్పింది. ఇందులో 12,40,764 మందికి ఫస్ట్ డోస్, 35,427 మంది లబ్ధిదారులకు రెండో డోస్ వేసినట్లు చెప్పింది. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 36.7లక్షల డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.