న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 58.82కోట్ల డోసులకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు 56,10,116 మోతాదులు అందజేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 23 నాటికి టీకా డ్రైవ్ 220వ రోజుకు చేరింది. నిన్న 39,62,091 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా.. 16,48,025 మంది రెండో మోతాదు ఇచ్చినట్లు చెప్పింది. టీకా డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి 58,82,21,623 డోసులు పంపిణీ చేయగా.. ఇందులో 45,55,21,465 మందికి తొలి.. మరో 13,27,00,158 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.