జమ్మూ: ఇటీవల గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కశ్మీరీ నేతకు ఇప్పుడు స్థానికులు మద్దతు పలుకున్నారు. ఆజాద్ బాటలోనే ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆజాద్కు మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ పార్టీకి రాజీనామా చేశారు. సోనియా గాంధీతో పాటు అనేక మంది నేతలకు సంయుక్త రాజీనామా లేఖను సమర్పించారు. కశ్మీర్కు చెందిన మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వాని, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్, ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ ఉన్నారు. కాంగ్రెస్కు ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత ఆ రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ నేతలు సామూహికంగా రాజీనామా చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్న ఆజాద్ చేసిన ప్రకటన కూడా స్థానిక నేతల్ని ఆకట్టుకున్నది. కార్పొరేటర్లు, జిల్లా, బ్లాక్ లెవల్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ను వీడి ఆజాద్తో చేతులు కలిపారు. రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనమైనట్లు ఆజాద్ ఆరోపించిన విషయం తెలిసిందే.