న్యూఢిల్లీ: థాయ్లాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ప్రపంచ చాంపియన్షిప్ రజత విజేత అమిత్ పంగల్తో పాటు అనంత ప్రహ్లాద్, సుమిత్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. దీంతో టైటిల్ పోరులో నిలిచిన భారత బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల 52 కిలోల సెమీస్ పోరులో అమిత్..ట్రాన్వాన్ తావో(వియత్నాం)పై అలవోక విజయం సాధించాడు. ప్రత్యర్థిపై పంగల్ పదునైన పంచ్లతో చెలరేగి కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. సుమిత్..అయతుల్లా తకీజ్(కజకిస్థాన్)పై గెలువగా, మహిళల సెమీస్లో అనంత 5-0 తేడాతో బుయి త్రోన్తాయి(వియత్నాం)పై విజయాన్నందుకుంది. మరోవైపు మనీశ(57కి), పూజ(69కి), భాగ్యబతి కచారీ(75కి) సెమీస్లో ఓడి కాంస్య పతకంతో సంతృప్తిపడ్డారు.