కాసిపేట, ఫిబ్రవరి 10 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం కాసిపేట మండల ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ఒల్లెపు రాజు, ఉపాధ్యాక్షుడిగా బదావత్ రమేష్, కోశాధికారిగా ఇనుముల రవి, ప్రచార కార్యదర్శిగా పుర్ర మనోజ్ లను ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన కమిటీని పలువురు అభినందించారు. ట్రాక్టర్స్ ఓనర్స్, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన నాయకులు పేర్కొన్నారు.