హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించా రు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎస్సీ గురుకులాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అధికారులు తరచూ గురుకులాలను సందర్శించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం, తరగతుల నిర్వహణ, పరీక్షా ఫలితాలు, విజయాలపై దృష్టి సారించాలని దిశా నిర్దే శం చేశారు.
నర్సింగ్, ఇంజినీరింగ్, బాలుర కోసం 15 డిగ్రీ కాలేజీల ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్త్తానని అన్నారు. సమావేశంలో ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రా హుల్ బొజ్జా, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.