అమ్రాబాద్, ఆగస్టు 5 : మన్ననూర్-శ్రీశైలం మార్గంలో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన ప్రాథమిక సాంకేతిక పనులను అధికారులు పరిశీలించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో డీఎఫ్వో రేవంత్చంద్ర ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన సాంకేతిక నిపుణులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను సందర్శించి సమావేశమయ్యారు.
ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ లే అవుట్ వెంట ప్రాథమిక సర్వే, ప్రతిపాదిత కారిడార్ నిర్మాణంతో వన్యప్రాణులు వాటి ఆవాసాలపై కలిగే ప్రభావాలను అంచనా వేయడం, ఎంత మేరకు అటవీ భూమి మళ్లింపునకు గరయ్యే అవకాశం ఉందన్న అంశాలపై చర్చించినట్టు డీఎఫ్వో తెలిపారు.