భువనేశ్వర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఒడిశా పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆయన కాన్వాయ్పైకి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా భారీగా బలగాలను మోహరించారు.
వారిని తప్పించుకొని కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు కాన్వాయ్పై గుడ్లు విసిరారు. కటక్లోని ముండులిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒడిశాకు రాగా.. మంత్రికి వ్యతిరేకంగా ఎన్యూఎస్యూ నేతలు నల్లజెండాలను ప్రదర్శించగా.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 3న ఉత్తర్ప్రదేశ్ అఖింపూర్ ఖేరిలో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో.. మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను 9న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి కాన్వాయ్లోని ఓ వాహనం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి దూసుకెళ్లగా.. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రి, ఆయన కుమారుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.