హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా న్యూజిలాండ్ ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వొడ్నాల ఆధ్వర్యంలో సీఎం బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనుకావ్ బ్లడ్ సెంటర్లో రక్తదానం చేశారు.
అలాగే రేపు కూడా మరికొంత మంది ఎన్నారైలు రక్తదానం చేస్తారని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండూ నూరేండ్ల జీవించాలని, తెలంగాణను మరింతగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.