హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యారడైజ్..క్రమంగా తన వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. తాజాగా వరంగల్లో కొత్తగా హోటల్ను ఆరంభించింది. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అవుట్లెట్ను ప్రారంభించినట్లు ప్యారడైజ్ ఫుడ్కోర్ట్ చైర్మన్ ఆలీ హేమతి తెలిపారు. వరంగల్ ప్రజలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిర్యానీని అందించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త అవుట్లెట్ను ఆరంభించినట్లు చెప్పారు. దీంతో మొత్తం అవుట్లెట్ల సంఖ్య 43కి చేరుకున్నది.