దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలికాలంలో పలువురు సినీప్రముఖులు వరుసగా ఈ మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా బాలీవుడ్ కథానాయిక నోరా ఫతేహికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘గత కొద్దిరోజులుగా నేను మంచానికే పరిమితమైపోయాను. వైరస్ ప్రభావం ఎక్కువగా అనిపిస్తున్నది. ప్రస్తుతం ఆసుప్రతిలో చేరి చికిత్స తీసుకుంటున్నా. వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తున్నది. ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు’ అని తెలిపింది. బాలీవుడ్ అగ్ర కథానాయిక కరీనాకపూర్ ఈమధ్యే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.