హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో నోముల భగత్కు టికెట్ కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
నోముల ఝాన్సీ అధ్యక్షతన కాన్బెర్రాలో ఏర్పాటు చేసినసమావేశంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ తరపున నాగార్జున సాగర్లో ప్రత్యక్ష , పరోక్ష ప్రచారంలో పాల్గొని భగత్ కు అత్యధిక మెజారిటీ వచ్చే కృషి చేయాలని కమిటీ ఆధ్వర్యంలో తీర్మానించారు.
ఆస్ట్రేలియా నుంచి ఒక బృందం ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నది. అలాగే ఆస్ట్రేలియా నుంచి సోషల్ మీడియా, ఫోన్ ల ద్వారా ప్రతి ఓటరను సంప్రదించనున్నారు. నోముల నరసింహయ్య కేవలం రెండేండ్లలో చేసిన సేవలను, జానారెడ్డి 35 సంవత్సరాలలో చేయలేకపోయారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే భగత్ ఎన్నికల అస్త్రాలని, కేసీఆర్ బొమ్మే విజయ అస్త్రమని ఆ శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో రవి సాయల, రాకేష్ లక్కరసు, వీరు సాంబరాజు, సతీష్, రుద్ర, రమేష్, విజయ్ జాదవ్, భవాని, కిషోర్, శ్వేత, అనిత ఉగం తదితరులు పాల్గొన్నారు.