సిద్దిపేట అర్బన్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరపున తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ ఎన్నికల ఇన్చార్జికి సీఎం కేసీఆర్ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు, తదితర జిల్లాల చైర్మన్లు పాల్గొన్నారు.