న్యూఢిల్లీ : నోకియా బ్రాండ్ లైసెన్స్దారు హెచ్ఎండీ గ్లోబల్ భారత్లో నోకియా టీ10 ట్యాబ్లెట్ను లాంఛ్ చేసింది. గత ఏడాది లాంఛ్ అయిన నోకియా టీ20కి రిఫ్రెష్డ్ వెర్షన్గా న్యూ అండ్రాయిడ్ టీ10 ట్యాబ్లెట్ కస్టమర్ల ముందుకొచ్చింది. డిజైన్ పరంగా నోకియా టీ10, టీ20 ఒకే తరహాలో ఉన్నాయి. 10.4 ఇంచ్కు బదులుగా నోకియా టీ10 8 ఇంచ్ డిస్ప్లేతో ఎంట్రీ ఇచ్చింది.
నోకియా టీ10 ట్యాబ్లెట్ తొలుత ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో జులైలో లాంఛ్ అయింది. ఈ ట్యాబ్లెట్తో రియల్మి ప్యాడ్ మినికి దీటైన పోటీ ఇచ్చేందుకు నోకియా సన్నద్ధమైంది. ఇక భారత్లో నోకియా టీ10 బ్లూ ఫినిష్తో ముందుకు రాగా, బేస్ 3జీబీ ర్యాం వెర్షన్ రూ 11,799 కాగా, 4జీబీ ర్యాం 64జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ 12,799కి లభిస్తుంది. న్యూ మోడల్ అమెజాన్తో పాటు నోకియా ఇండియా వెబ్సైట్లో అందుబాటులో ఉంది. భారత్లో ఎల్టీఈ వేరియంట్ను కూడా త్వరలో లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.