ముంబై: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ భేటీ జరిగినట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర మంత్రి-ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ కొట్టి పారేశారు. పవార్, అమిత్షా మధ్య ఎటువంటి సమావేశం జరుగలేదని ఆదివారం పేర్కొన్నారు.
అమిత్షాతో శరద్ పవార్ భేటీపై సోషల్ మీడియాలో వదంతులు షికారు చేశాయి. కానీ అటువంటి మీటింగేమీ జరుగలేదని నవాబ్ మాలిక్ చెప్పారు. గత రెండు రోజుల్లో అమిత్షాతో శరద్ పవార్ సాహెబ్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సమావేశమైనట్లు గుజరాత్ వార్తా పత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. ట్విట్టర్ వేదికగా వదంతులు వ్యాప్తి చెందాయి. కానీ అటువంటి భేటీ ఏమీ జరుగలేదని నవాబ్ మాలిక్ తెలిపారు.
బీజేపీ తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేస్తూ గందరగోళం స్రుష్టిస్తున్నదని నవాబ్ మాలిక్ ఆరోపించారు. కొంత మంది గందరగోళం కల్పించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారన్నారు. అమిత్షాతో పవార్ భేటీ కావడానికి ఎటువంటి కారణం లేదన్నారు. అంతకుముందు పవార్తో భేటీపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రతిదీ బయట పెట్టలేం కదా? అని దాటవేశారు.
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
ధావన్, పంత్, హార్దిక్ మెరుపులు..భారత్ 329 ఆలౌట్
టయోటా కార్లు ప్రియం ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు
ఆదానీ చేతికి కర్నూల్-వరోరా ట్రాన్సిమిషన్!
ఇక మెడికల్, డిజటల్ సహా పలు రంగాల్లోకి టాటా విస్తరణ
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!