న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేవారిని ఎవరూ గుర్తు పెట్టుకోరు అని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఎంపీలు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాల వల్ల లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాజిటివ్ సమాచారాన్ని ఇచ్చిన ఎంపీలను ఎప్పటికీ అందరూ గుర్తు ఉంచుకుంటారన్నారు. సభా సమావేశాలను అడ్డుకునేవాళ్లను ఎవరూ గుర్తుంచుకోరన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాజిటివ్ అంశాలను ప్రప్తావించేవారిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు.
#WATCH | PM Modi targets the disruptive Members of Parliament
“I hope the MPs who are in the habit of ripping apart democratic values will self-introspect on what they did in their term as members of Parliament. Those who contributed positively to the Parliament will be… pic.twitter.com/oPlxsYj6o8
— ANI (@ANI) January 31, 2024
ఫిబ్రవరి 9వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆ సంప్రదాయాన్ని పాటిస్తామన్నారు.