రాహుల్గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ కార్యదర్శి జారీచేసిన నోటిఫికేషన్లో లోపాలున్నాయని పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. నోటిఫికేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి లేదని లోక్సభ మాజీ కార్యదర్శి పీడీటీ ఆచార్య అన్నారు.
ఆర్టికల్ 102 ప్రకారం అనర్హత వేటు వేయొచ్చు. అయితే రాష్ట్రపతి నిర్ణయం తర్వాతే ఈ అనర్హత వేటు అమల్లోకి వస్తుందని ఆచార్య పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని కోరి రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆర్టికల్ 103 కూడా ఇదే విషయం చెబుతున్నదన్నారు.