నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 15 :జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ ఏడోరోజైన గురువారం కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్. నాగరాజు పర్యవేక్షణలో సాయంత్రం వరకు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పరీక్షలకు 1,226 మంది అభ్యర్థులకు గాను 1,024 మంది హాజరయ్యారు. ఉదయం నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్తోపాటు 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఎత్తు, కొలతలు నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించిన అనంతరం ఈవెంట్స్ నిర్వహించారు. గురువారం నిర్వహించిన పరుగు పందెం, ఎత్తు, కొలతలు, షాట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్లో 505 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు సీపీ వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి గ్రౌండ్కు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో పలు చోట్ల బోర్డులను ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో డీసీపీ అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, హోమ్గార్డ్స్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కేఎం.కిరణ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, నారాయణ, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపీ సంతోష్, కామారెడ్డి ఏఆర్ డీఎస్పీ ఉదయ్కృష్ణ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పరిపాలనా అధికారి రామారావు, మ్యాగ్నిటిక్ ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్చార్జి మణికంఠ, ఎన్ఐబీ సీఐ ముఖీద్ పాషా, అన్ని డివిజన్ల సీఐలు, ఎస్సైలు, సూపరింటెండెంట్లు శంకర్, శ్రీనివాస్, మహ్మద్ మక్సూద్ హైమద్, గోవింద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీశైలం, ఈ-సాఫ్ట్ ఇన్చార్జి కె.వంశీ చక్రవర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లతో పాటు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు.