వేల్పూర్, డిసెంబర్ 4 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన వేల్పూర్లో గ్రామస్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన సొంత ఖర్చులతో చేస్తున్న సేవా కార్యక్రమాలపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి, దివంగత రైతు నేత వేముల సురేందర్రెడ్డి, తన నానమ్మ గంగవ్వ తాతయ్య వేముల నర్సారెడ్డి జ్ఞాపకార్థం వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వేల్పూర్లో సీడీపీ నిధులు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో సౌకర్యాల కల్పనకు మంత్రి చేయూతనందిస్తున్నారు. గ్రామస్తులు వివిధ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు కల్యాణ మండప నిర్మాణానికి మంత్రి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేయించడంతోపాటు వంటలు చేసే సామగ్రి, కుర్చీలు, ఇతర వస్తువులను తన సొంత నిధులు రూ. 5 లక్షలతో సమకూర్చారు. త్వరలో ఈ కల్యాణ మండపాన్ని మంత్రి తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు..
వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రూ.25 లక్షలతో తన తండ్రి వేముల సురేందర్రెడ్డి స్మారక రైతువేదిక భవనాన్ని నిర్మింపజేశారు. గ్రామంలోని వైకుంఠధామంలో రూ.5 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనం అభివృద్ధితోపాటు చిన్నారులు ఆడుకోవడానికి రూ.2 లక్షలతో సౌకర్యాలను కల్పించారు. గ్రామంలో తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో రూ.2 లక్షలతో స్టేజిని నిర్మింపజేశారు. పుట్టిన ఊరి కోసం మంత్రి జేస్తున్న సేవా కార్యక్రమాలపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులందరికీ ఉపయోగపడేలా..
గ్రామస్తులందరికీ ఉపయోగపడేలా వేల్పూర్లో సీడీపీ నిధులు రూ.50 లక్షలతో కల్యాణ మండప నిర్మాణానికి మంత్రి ఎంతో కృషి చేశారు. కల్యాణ మండపం ప్రారంభమైతే స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పేద ప్రజలు శుభ కార్యక్రమాలు నిర్వహించేందుకు కల్యాణ మండపం సౌకర్యంగా ఉంటుంది.
మంత్రికి రుణపడి ఉంటాం
వేల్పూర్ గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామస్తులకు ఎప్పటికీ గుర్తుండేలా, పేద ప్రజలకు ఉపయోగపడేలా మంత్రి ప్రశాంత్రెడ్డి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామస్తులమందరం మంత్రికి రుణపడి ఉంటాం.
మంత్రి సేవలు మరువలేము
వేల్పూర్ గ్రామంలో కొన్ని తరాలకు ఉపయోగపడే విధంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. తన సొంత ఖర్చులతో గ్రామస్తులకు ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మంత్రి తన నానమ్మ – తాతయ్య జ్ఞాపకార్థం కల్యాణ మండపంలో వంటలు చేసే సామగ్రి, కుర్చీలను వితరణ చేయడం సంతోషకరం.