ఖలీల్వాడి, డిసెంబర్ 4 : ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య శనివారం మృతిచెందడంపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటు అని అన్నారు. ఉమ్మడి రాష్ర్టానికి ఎన్నో సేవలు అందించారని, 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదేనని గుర్తుచేసుకున్నారు. అనంతరం హైదరాబాద్లో రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు.