యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిం చారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు. పాతగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్యపూజలు ఆలయ సంప్రదాయరీతిలో కొనసాగాయి.